మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని  స్కూల్​ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు

మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని  స్కూల్​ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులు

వెల్గటూర్, వెలుగు:  ధర్మపురి మండలం లోని ఆరవెల్లి పాఠశాలలో  మధ్యాహ్నం పురుగుల అన్నం , నీళ్ళ చారు  పెడుతున్నారని సోమవారం  విద్యార్థులు  ఆందోళన చేశారు. అనంతరం  పాఠశాలను విడిచి వెళ్లారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం అరవెల్లి  హైస్కూల్లో  పురుగులు పడిన అన్నం , వెంట్రుకలు తో కూడిన కూరలు,  నీళ్ల చారును   పెడుతున్నారని అన్నారు.

నాణ్యమైన భోజనం పెట్టేవరకు తాము స్కూల్​కు రామని ఆగ్రహించారు.   మధ్యాహ్న భోజనం నిర్వహణ పై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.