ఓఆర్​ఆర్​పై కార్లతో స్టంట్లు

ఓఆర్​ఆర్​పై కార్లతో స్టంట్లు

శంషాబాద్, వెలుగు:  శంషాబాద్ మండల పరిధిలోని ఓఆర్ఆర్ పై కార్లతో  కొందరు వ్యక్తులు  స్టంట్లు చేయడం కలకలం సృష్టించింది.  రూరల్ ఇన్​స్పెక్టర్​ నరేందర్ రెడ్డి  వివరాల ప్రకారం..   ఆదివారం తెల్లవారుజామున  3 గంటలకు  శంషాబాద్ టోల్‌గేట్ ఎగ్జిట్ నెం.16, పెద్ద గోల్కొండ టోల్‌గేట్ ఎగ్జిట్ నెం. 15 మధ్య  ఇద్దరు గుర్తు తెలియని  వ్యక్తులు  కార్లతో స్టంట్లు క్రియేట్​ చేశారు.

ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు.  సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు రాగా.. వారు కార్లలో పారిపోయారు. ఆ కార్లకు నంబర్​ ప్లేట్లు లేవని పోలీసులు తెలిపారు. త్వరలోనే ట్రెస్ చేసి పట్టుకుంటామని సీఐ  పేర్కొన్నారు.