
తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. మనోహరాబాద్ మండలం కుచారంలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని నకిలీ పత్రాలతో రూ. 80 లక్షలకు అరుణ్ కుమార్ తో పాటుగా మరో ఎనిమిది మంది విక్రయించారు . నకిలీ పత్రాలతో తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబ్ రిజిస్ట్రార్ తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.