
గచ్చిబౌలి, వెలుగు: రోజంతా భోజన ప్రియులతో కిక్కిరిసి కనిపించే కొండాపూర్సుబ్బయ్యగారి హోటల్లో శుక్రవారం ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్లో పొంగుతున్న ఓపెన్డ్రైనేజీ ఉన్నట్లు, అపరిశుభ్ర వాతావరణంలో వంట చేస్తున్నట్లు గుర్తించారు. వాడిపోయిన ఆకుకూరలు బూజు పట్టినట్లు గుర్తించారు.
కిచెన్ఫ్లోరింగ్మొత్తం పగుళ్లు ఏర్పడి, మురుగునీరు పొంగిపోర్లుతుండడాన్ని చూసి విస్తుపోయారు. స్టోర్రూం అధ్వానంగా ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఫైర్అయ్యారు. అక్కడ వాడుతున్న ఆయిల్ను టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని పేర్కొన్నారు.