
జూబ్లీహిల్స్, వెలుగు: సుచిర్ ఇండియా సీఈఓ కిరణ్ సుచిర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. సంస్థకు చెందిన డబ్బును ఓ ఉద్యోగి సొంతానికి వాడుకున్నాడనే నెపంతో గదిలో బంధించి కొట్టినట్లు ఫిర్యాదు అందింది. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన బిజినెస్మెన్ కిరణ్ కు సుచిర్ ఇండియా పేరుతో వరంగల్లో పార్క్ఉంది. ఆ పార్క్కు ఇన్చార్జిగా రెండు నెలల కింద స్థానికంగా ఉండే ప్రియాంక్ అనే వ్యక్తిని నియమించాడు.
సందర్శకుల నుంచి టిక్కెట్ రూపంలో డబ్బు వసూలు చేసి ప్రియాంక్సంస్థ అకౌంట్లో వేయాల్సి ఉంది. అయితే డబ్బులో రూ.5 లక్షలు తేడా రావడంతో కంపెనీ సీఈఓ కిరణ్.. ప్రియాంక్ను సిటీలోని తన ఆఫీసుకు రమ్మన్నాడు. ప్రియాంక్రాలేదు. తర్వాత నందినగర్లోని ఇంటికి పిలిపించి కిరణ్తీవ్రంగా కొట్టాడు. ఓ గదిలో బంధించాడు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్పోలీసులు అతడిని విడిపించారు. కిరణ్పై కేసు నమోదు చేశారు.