సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా ‘మిస్టర్ సెలెబ్రిటీ’. చందిన రవి కిషోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్ పాండు రంగారావు నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్ను హీరో గోపీచంద్ రిలీజ్ చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘నీ జతగానే ఉండిపోనా.. నిన్నువీడి నేను ఉండగలనా.. నిన్ను నన్ను ఎవరైనా వేరు చేయనా.. నీతో నాకు ఉన్నది చెలిమేనా..’ అంటూ సాగిన పాటను వినోద్ యాజమాన్య కంపోజ్ చేయగా ఎ గణేష్ అందమైన లిరిక్స్ రాశాడు. జావెద్ అలీ పాడిన తీరు ఆకట్టుకుంది.
Also Read : ఈ మత్తు దసరా వరకు
కామన్ మ్యాన్ నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఇష్యూని ఇందులో చూపించబోతున్నట్టు డైరెక్టర్ రవి కిషోర్ ఇందులో చూపించబోతున్నాడు. ఈ జనరేషన్కు తగ్గ కంటెంట్ ఇందులో ఉందని నిర్మాతలు తెలియజేశారు.
సెలెబ్రిటీల మీద బయట వచ్చే రూమర్లను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్న దర్శకుడు రవి కిషోర్ సినిమాను బాగా తెరెకెక్కించినట్లు సమాచారం. ఈ మూవీ ఎలాంటి హిట్ సొంతం చేసుకోనుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.