తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్‌రెడ్డి

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్‌రెడ్డి
  • వికాస్​రాజ్​ను రిలీవ్​చేసిన ఈసీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చీఫ్‌‌‌‌ ఎలక్టోరల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ (సీఈవో)గా సుదర్శన్‌‌‌‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత సీఈవో వికాస్‌‌‌‌రాజ్‌‌‌‌ను ఈసీ రిలీవ్‌‌‌‌ చేసింది.సుదర్శన్‌‌‌‌రెడ్డి ప్రస్తుతం జీఏడీ (సర్వీసెస్, హెచ్ఆర్) ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్​ అయిన వికాస్​రాజ్​ను ట్రాన్స్​పోర్ట్​, రోడ్లు, భవనాల శాఖల స్పెషల్​ సీఎస్​గా నియమించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సమాచారం.