
మోపాల్, వెలుగు : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్నాయకుడు మాజీ మంత్రి, బోధన్ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ జిల్లా ఆదివాసి గిరిజన సంఘం చైర్మన్ యాదగిరి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఆదివారం మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో సుదర్శన్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి జిల్లాలోని సాగునీటి సమస్యను పరిష్కరించారని, ప్రాణహిత చేవెళ్ల పథకంతో నిజామాబాద్రూరల్ నియోజకవర్గంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయవంతంగా సాగుతుందన్నారు. సుదర్శన్రెడ్డి మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ జిల్లా నేతలు సీఎం రేవంత్రెడ్డి కలిసి వినతి పత్రాలను సైతం అందజేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీఎంస్ చైర్మన్తారాచంద్నాయక్, నాయకులు, చంద్రునాయక్, బున్నేరవి, రవినాయక్ పాల్గొన్నారు.