సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్

సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా నర్ర అరుణ్ కుమార్ ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఎండీ శైబుద్దీన్ అధ్యక్షతన పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొత్త కార్యవర్గానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ శుభాకాంక్షలు తెలిపారు.

ALSO Read :ఉత్తమ సేవలతోనే గుర్తింపు దక్కుతుంది