ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్​ ఫ్యాక్టరీ కార్మికులు

ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్​ ఫ్యాక్టరీ కార్మికులు

బోధన్​,వెలుగు: నిజాం షుగర్స్​​ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులు ఆదివారం నిజామాబాద్​లో టీఎన్జీవో భవన్లో ఎమ్మెల్సీ కొదండరాంను కలిసి వినతిపత్రం అందించారు. ఫ్యాక్టరీని రీఓపెన్​ చేయించాలని, కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలు ఇప్పించాలని, కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం నియమించిన కమిటీ తొందరగా నిర్ణయం తీసుకొని ఫ్యాక్టరీని  ప్రారంభించాలని కోరారు. 

దీంతో ఎమ్మెల్సీ కోదండరాం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు సీయం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కార్మిక సంఘం నాయకులు ఉపేందర్​, రవిశంకర్ గౌడ్, పోల్కా స్వామి, శ్రీధర్, హరిచంద్ , కార్మికులు పాల్గొన్నారు.