మహిళను కాపాడిన పోలీసులు

మహిళను కాపాడిన పోలీసులు

ఆమనగల్లు, వెలుగు: హైదరాబాద్  లాలాగూడకు చెందిన మంగమ్మ(30) ఇంట్లో గొడవపడి పిల్లలు తేజస్విని(4), జై నాయక్(6)తో కలిసి శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్పటికే భర్త రాములు లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు సెల్ ఫోన్  లొకేషన్ తో ఆమనగల్లు ఆసుపత్రి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. 

స్థానిక ఎస్ఐ బలరాం నాయక్  ఆసుపత్రికి చేరుకొని విచారిస్తుండగా, అప్పటికే విషం తీసుకున్న మంగమ్మ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, ప్రాణాలతో బయటపడింది. మంగమ్మ ప్రాణపాయం నుంచి తప్పిందని డాక్టర్లు చెప్పారు.