
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గా దామల్ల సుజాత శనివారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పని చేసిన సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ తస్లీమా ఏసీబీకి చిక్కన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ములుగులో పని చేస్తున్న సబ్రిజిస్ట్రార్ సుజాతను ఇక్కడ ఇన్చార్జిగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.