గంజాయి కొంటూ పోలీసులకు చిక్కిన జూడాలు

గంజాయి కొంటూ పోలీసులకు చిక్కిన జూడాలు

బషీర్ బాగ్, వెలుగు: కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద గంజాయి కొంటున్న ఇద్దరు జూనియర్​ డాక్టర్లను, గంజాయి విక్రయిస్తున్న పాత నేరస్థుడిని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూల్​పేటకు చెందిన గంజాయి పెడ్లర్ సురేశ్​సింగ్​పాత నేరస్థుడు. 2016 నుంచి ఇతను గంజాయి దందా చేస్తున్నాడు. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఇతనిపై ఐదు కేసులు నమోదై ఉన్నాయి.

శుక్రవారం ఉదయం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లు కె.మణికందన్, వి.అరవింద్ కు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జూనియర్​డాక్టర్లు ఉస్మానియా కాలేజీలో పీజీ ఫస్ట్​ఇయర్​చదువుతున్నట్లు తెలిసింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలోని మరికొంత మంది జూడాలు సురేశ్​సింగ్ వద్ద గంజాయి కొంటున్నట్లు తెలిసింది. నిందితుల నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.