Ramakrishna Math: రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు.. షెడ్యూల్ విడుదల

Ramakrishna Math: రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు.. షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ప్రతీ ఏటా నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు షెడ్యూల్ విడుదలైంది. 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు వివిధ అంశాలపై నిర్వహించే శిక్షణ శిబిరాలకు సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అడ్మిషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు అధ్యక్షులు స్వామి బోధమయానంద.

వేసవి శిబిరాలలో భాగంగా నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు వేర్వేరుగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అడ్మిషన్లు కావాలనుకునేవారు తమ చిన్నారుల స్కూల్ ఐడెంటిటీ కార్డుతో హాజరుకావాలని చెప్పారు. రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కార్యాలయంలో అడ్మిషన్ కావాల్సింగా సూచించారు. ఏడో తరగతి విద్యార్థులకు  ఏప్రిల్ 28 నుంచి మే 11 వరకు.. అలాగే 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మే 12 నుంచి మే 25 వరకు సంస్కార్ పేరిట వేసవి శిబిరాలు నిర్వహిస్తామని స్వామి బోధమయానంద చెప్పారు. 

ధ్యానము, యోగాసనాలు, నైతిక విలువలకు సంబంధించిన అంశాలపై నిపుణులతో శిక్షణ ఇస్తామన్నారు.  ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 14 నుంచి 24 వరకు శ్రద్ధ పేరిట వ్యక్తిత్వ వికాస శిబిరాన్ని నిర్వహించనున్నారు.  మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 040 27627961, లేదా 9177232696.