చర్లపల్లి– -దానాపూర్​ మధ్య సమ్మర్ ​ప్రత్యేక రైలు

చర్లపల్లి– -దానాపూర్​ మధ్య సమ్మర్ ​ప్రత్యేక రైలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: వేసవి సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ సందర్భంగా చర్లపల్లి– దానాపూర్​ మధ్య ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3.20 గంటలకు (నెం.07419) ట్రెయిన్​ బయలుదేరి వెళ్తుందన్నారు. అలాగే  21 నుంచి 28 వరకు దానాపూర్​నుంచి చర్లపల్లికి ఉదయం11.40  గంటలకు చేరుకుంటుందని రైల్వే చీఫ్​ పబ్లిక్​రిలేషన్స్​ఆఫీసర్​ఎ. శ్రీధర్​ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్​కాగజ్​నగర్, బల్లార్ష, నాగ్​పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్​పూర్, కత్ని, సత్నా, మాణిక్​పూర్, ప్రయాగ్​రాజ్, చియోకీ, పండిత్​దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బుక్సార్​, అరాస్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్​ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్​క్లాస్​కోచ్​లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.  

ఈస్టర్ ​సందర్భంగా కల్వరికి ప్రత్యేక ఎంఎంటీఎస్​లు

హైదరాబాద్ సిటీలోని కల్వరి టెంపుల్ లో ఈ నెల 20న జరిగే ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఎంఎంటీఎస్​ రైళ్లను నడుపుతామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ –లింగంపల్లి మధ్య నడిచే ట్రైన్ ఈ నెల 20న ఉదయం 3.15 గంటలకు హైదరాబాద్​నుంచి బయల్దేరి లింగంపల్లికి ఉదయం 4.05 నిమిషాలకు చేరుకుంటుందని చెప్పారు.

లాగే ఫలక్​నుమా– లింగంపల్లి మధ్య నడిచే ట్రైన్ ఉదయం 2.30 గంటలకు ఫలక్​నుమా నుంచి, సికింద్రాబాద్​నుంచి 3.05 /3.10 గంటలకు బయల్దేరే ట్రెయిన్​లింగంపల్లికి ఉదయం4 గంటలకు చేరుకుటుందని పేర్కొన్నారు. లింగంపల్లి నుంచి ఫలక్​నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్​ఉదయం 2.50 గంటలకు లింగంపల్లి నుంచి, సికింద్రాబాద్​ నుంచి 3.30/3.35గంటలకు బయల్దేరి ఫలక్​నుమాకు ఉదయం 4.30 గంటలకు చేరుకుంటుందని అధికారులు వివరించారు.