సన్​ ఫార్మా చేతికి చెక్ ​పాయింట్..​ డీల్​ విలువ రూ.3,100 కోట్లు

సన్​ ఫార్మా చేతికి చెక్ ​పాయింట్..​ డీల్​ విలువ రూ.3,100 కోట్లు

న్యూఢిల్లీ: ఇమ్యునోథెరపీ కంపెనీ చెక్ ​పాయింట్​థెరప్యూటిక్స్​ను 355 మిలియన్​ డాలర్లకు (దాదాపు రూ.3,100 కోట్లకు) కొంటున్నామని సన్​ఫార్మా సోమవారం ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా ఇది ఒక్కో స్టాక్​కు ముందస్తుగా 4.10 డాలర్ల చొప్పున చెల్లిస్తుంది.

 సాలిడ్​ ట్యూమర్​ క్యాన్సర్స్ ​బాధితులకు ఇది మెడిసిన్స్ ​తయారుచేస్తుంది. నాస్​డాక్​లో లిస్టయింది. చెక్ ​పాయింట్​ తమ చేతికి రావడం వల్ల అంకో డెర్మో థెరపీ పోర్ట్​ఫోలియోను మరింత విస్తరించగలుగుతామని సన్​ఫార్మా ఎండీ దిలీప్​ షాంఘ్వీ అన్నారు.