భూమిని తీసుకుని పరిహారం ఇవ్వలేదని.. సుందిళ్ల గ్రామస్తుల ఆందోళన

భూమిని తీసుకుని పరిహారం ఇవ్వలేదని.. సుందిళ్ల గ్రామస్తుల ఆందోళన

గోదావరిఖని, వెలుగు: సింగరేణి విస్తరణకు తీసుకున్న భూములకు నేటికీ పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ రామగిరి మండలం సుందిళ్ల గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. ఓపెన్​ కాస్ట్​5 ప్రాజెక్ట్​ వద్దకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రామగిరి మండలం సుందిళ్ల గ్రామ శివారులోని 31 మంది రైతులకు చెందిన 46 ఎకరాలు 2020లో సింగరేణి తీసుకుందని, ఇప్పటివరకు ఆ భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపించారు.

 ఓపెన్​కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం నిర్వహించిన పబ్లిక్​ హియరింగ్​టైంలోనూ నష్టపరిహారం చెల్లిస్తామని అప్పటి ఆఫీసర్లు హామీ ఇచ్చారని వాపోయారు. సుమారు మూడు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగగా.. టూ టౌన్​ సీఐ ప్రసాదరావు, ఓసీపీ మేనేజర్​అనిల్​ గబాలే, సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్​వీరారెడ్డి.. గ్రామస్తుల వద్దకు వెళ్లి ఆఫీసర్లతో మాట్లాడాలని సూచించారు.