సీఓఈ స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసులో సునీల్ జోషి

సీఓఈ  స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసులో సునీల్ జోషి

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్ (సీఓఈ)లో స్పిన్ బౌలింగ్ కోచ్ పదవికి పోటీపడుతున్నాడు. మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే రాజీనామా చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అసిస్టెంట్ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేరిన తర్వాత ఈ పోస్టు ఖాళీ అయింది. గతంలో నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకాడమీగా సేవలందించిన సీఓఈలో ఈ పోస్టు కోసం జోషి దరఖాస్తు చేసుకున్నాడు. 

బోర్డు సమాచారం ప్రకారం అతను సీఓఈ  క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్​ సెలెక్టర్ అజిత్ అగార్కర్,  బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) అబేయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కురువిల్లాతో కూడిన ప్యానెల్ ముందు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.  మరో నలుగురు అభ్యర్థులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 

వారిలో ఇండియా అండర్-19 విమెన్స్‌‌ టీమ్  కోచ్ నూషిన్ అల్ ఖదీర్ కూడా ఉంది. . గుజరాత్, సౌరాష్ట్ర మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాకేష్ ధ్రువ్, విదర్భ ఆఫ్-స్పిన్నర్ ప్రీతమ్ గాంధీ కూడా ఈ పోస్టుకు పోటీ పడుతున్నారు. అయితే, ఎలైట్ స్థాయి కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి అనుభవంతో అందరిలో 54 ఏళ్ల జోషికే మొగ్గు కనిపిస్తోంది.