
వాషింగ్టన్: ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్)లో చిక్కుకు పోయిన నాసా ఆస్ట్రొనాట్లు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16న వాళ్లిద్దరినీ తీసుకువస్తామని నాసా అధికారులు సోమవారం ప్రకటించారు.
ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ డ్రాగన్లో సునీత, విల్మోర్ను భూమిపైకి తీసుకురానున్న ట్లు స్పష్టం చేశారు. ఈ ఇద్దరు ఆస్ట్రొనాట్లు 10 రోజుల ప్రోగ్రాంలో భాగంగా పోయినేడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్లో స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక స్టార్లైనర్లో హీలియం లీకేజీ కారణంగా సమస్యలు తలెత్తాయి. దీంతో వారు తిరిగి రాలేకపోయా రు. దాదాపు 9 నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు.