
శివ్వంపేట, వెలుగు : మండలంలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయ శర్మ ఆలయ మర్యాదలతో ఆమెను సత్కరించారు.
అనంతరం సికింద్లా పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆమె వెంట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శేఖర్, మహేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, యాద గౌడ్ఉన్నారు.