
హైదరాబాద్సిటీ, వెలుగు : ఉప్పల్ స్టేడియంలో ఆదివారం పరుగుల వరద పారింది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫస్ట్మ్యాచ్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటర్లు బౌండరీలతో ఫ్యాన్స్లో జోష్ నింపారు. బాల్.. బాల్కు ఈలలు, కేరింతలతో స్టేడియం హోరెత్తింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్రెడ్డి, క్లాసెన్ ఫైరీ షాట్లతో రాజస్థాన్ ముందు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో ఇదే హయ్యస్ట్ స్కోర్. తర్వాత చేజింగ్కు దిగిన రాజస్థాన్ బ్యాటర్లు సైతం బౌండరీలతో చెలరేగారు. కానీ భారీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ చూశామని క్రికెట్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.