Mahesh Babu: ఆ దర్శకుడితో మరో సినిమా చేస్తున్న మహేష్.. పాపం ఫ్యాన్స్

Mahesh Babu: ఆ దర్శకుడితో మరో సినిమా చేస్తున్న మహేష్.. పాపం ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడట. ఈ న్యూస్ తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. మహేష్ అన్నా ప్లీజ్ ఒద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ మహేష్ బాబు ఫ్యాన్స్ ను భయపెడుతున్న దర్శకుడు ఎవరు? వాళ్ళు అంతలా భయపడటానికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. అంతెందుకు మహేష్ ఫ్యాన్స్ సైతం ఓపెన్ గానే ఈ సినిమాపై కామెంట్స్ చేశారు. దాంతో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా. ప్రస్తుతం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. 

అయితే.. రాజమౌళి తరువాత మహేష్ బాబు చేయబోయే సినిమా గురించి, ఆ దర్శకుడి గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. మహేష్ బాబు మరోసారి దర్శకుడు త్రివిక్రమ్తో జతకట్టనున్నాడట. అవును.. గుంటూరు కారం సెట్స్ లనే మహేష్ కు ఒక లైన్ చెప్పాడట. అది నచ్చడంతో వెంటనే ఆ ప్రాజెక్టు ఒకే చేశాడట మహేష్. ఇప్పుడు ఈ సినిమా గురించి తెలిసి మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నాడట. 

కారణం ఏంటంటే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజా, గుంటూరు కారం. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. దీంతో త్రివిక్రమ్ సెంటిమెంట్ తమకు అచ్చిరావడం లేదని ఆయనతో సినిమాలు చేయొద్దు అంటూ మహేష్ ను రిక్వెస్ట్ చేస్తున్నారట ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు ఆ ప్రాజెక్టు మహేష్ క్యాన్సిల్ చేస్తాడా లేదా అనేది చూడాలి.