సింగరేణిలో సూపర్​స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి

సింగరేణిలో సూపర్​స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి

కోల్​బెల్ట్, వెలుగు: కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు సింగరేణి ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని బీఎంఎస్ స్టేట్​ ప్రెసిడెంట్​యాదగిరి సత్తయ్య సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్​ చేశారు. ఆదివారం మందమర్రిలోని బీఎంఎస్ ఆఫీస్​లో నిర్వహించిన యూనియన్​జనరల్​ బాడీ సమావేశానికి ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 

సింగరేణి కార్మికుల ఇన్​కమ్​ ట్యాక్స్​ను రాష్ట్ర సర్కార్ చెల్లించాలని, వారి సొంతింటి కల నేరవేర్చాలని కోరారు. కార్మికుల పిల్లలకు మెరుగైన విద్య కోసంసింగరేణి వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, సీబీఎస్ఈ సిలబస్​బోధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 14న శ్రీరాంపూర్​లో జరిగే యూనియన్​28వ ద్వై వార్షిక మహాసభలకు కార్మికులు భారీగా హాజరై సక్సెస్​ చేయాలని కోరారు.  సందర్భంగా పలువురు కార్మికులు బీఎంఎస్​లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.  

యూనియన్ ​నూతన కమిటీ నియామకం

మందమర్రి ఏరియా బీఎంఎస్​ నూతన కమిటీని నియమించినట్లు యాదగిరి సత్తయ్య తెలిపారు. ఏరియా వైస్​ ప్రెసిడెంట్​గా డొనికేన రమేశ్, ఏరియా సెక్రటరీగా గుర్రం ప్రదీప్​కుమార్, ఆర్గనైజింగ్​ సెక్రటరీలుగా డి.నరేశ్, పి.శ్రీనివాస్, అఖిలేశ్, బల్ల సురేశ్, జాయింట్ ​సెక్రటరీలు, ట్రెజరర్​ను నియమించారు. జనరల్ బాడీ సమావేశంలో బీఎంఎస్ జిల్లా సెక్రటరీ మద్దూరి రాజుయాదవ్​, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కేంద్ర ట్రెజరర్ వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు సారంగపాణి, కేంద్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.