- జడ్జిల నియామకం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు శాశ్వత జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. బుధవారం సీజేఐ నేతృత్వంలో భేటీ అయిన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం హైకోర్టులో అడిషనల్ జడ్జిలుగా పనిచేస్తున్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజనను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు పేర్కొంది.