గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1 దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కొట్టేసింది. గ్రూప్-1 నియామకాలపై పలు రకాల అభ్యంతరాలతో పిటిషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు .ఫిబ్రవరి 3న విచారణ సందర్భంగా.. అన్నింటినీ కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గ్రూప్ 1నియామకాలపై పలువురు అభ్యర్థులు గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించొద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. రిజల్ట్స్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. 2024 డిసెంబర్ 26 వాదనలు విన్న హైకోర్ట్ .. గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది.ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.ఆర్టికల్ 226 ప్రకారం.. తమకున్న విస్తృత అధికారాలతో తీర్పు వెలువరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుతో పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు గ్రూప్ 1 పై దాఖలైన అన్ని పిటిషన్లను ఇవాళ కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పుతో త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి.