
భారత అత్యున్నత న్యాయస్థానం 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లిష్ టైపింగ్లో నైపుణ్యంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా సెలెక్షన్స్ ఉంటాయి.
వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి-30 సంవత్సరాలు ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ఎక్స్-సర్వీస్స్మెన్ రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు రూ.250 అప్లికేషన్ ఫీజు, ఆన్లైన్లో జులై 10 వరకు చెల్లించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో 100 ప్రశ్నలకు (50 జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నలు, 25 జనరల్ ఆప్టిట్యూడ్, 25 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు) ఉంటుంది. ఈ పరీక్ష వ్యవధి 2 గంటలు. 1/4వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
2) ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ (25 ప్రశ్నలు) ఉంటుంది.
3) టైపింగ్ టెస్ట్ (కంప్యూటర్ మీద) ఉంటుంది. నిమిషానికి 35 పదాల చొప్పున టైప్ చేయాలి. ఈ పరీక్ష సమయం 10 నిమిషాలు.
4) డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్) - కాంప్రహెన్షన్ పాసేజ్, ప్రెస్సీ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటాయి. ఈ పరీక్షకు 2 గంటల సమయం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహించిన రోజే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష, టైపింగ్ స్పీడ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సెలెక్షన్ చేస్తారు .
వెబ్సైట్: www.sci.gov.in