బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుప్రీంకోర్ట్ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుప్రీంకోర్ట్ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దివాలా ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపాలని  నేషనల్ కంపెనీ లా అప్పిలేట్‌‌ట్రిబ్యునల్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలాట్‌) ఇచ్చిన ఆర్డర్స్​ను సుప్రీం కోర్టు పక్కన పెట్టేసింది. బీసీసీఐ, బైజూస్ పేరెంట్ కంపెనీ  థింక్ అండ్ లెర్న్ మధ్య  రూ.158 కోట్లకు బకాయిలకు సంబంధించి సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగడంతో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలాట్  దివాలా ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపింది.  

కానీ, చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలాట్ ఇచ్చిన సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాజాగా కొట్టేసింది. బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నుంచి అందుకున్న  ఈ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.158.9 కోట్లను  క్రెడిటార్ల కమిటీ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్ చేయాలని బీసీసీఐని ఆదేశించింది. 

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీర్పును సవాలు చేస్తూ  యూఎస్ కంపెనీ  గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ వేసిన పిటీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తాజాగా సుప్రీం కోర్టు తీర్పిచ్చింది.