
అలంపూర్, వెలుగు: ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని పొలాల్లో కుక్కల దాడిలో గాయపడిన జింకను గమనించిన 133 కేవీ సబ్ స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ సుబ్బారెడ్డి, హోంగార్డ్ రమేశ్ గాయపడిన జింకను అవుట్ పోస్ట్ కు తరలించి ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కీర్తి గాయపడిన జింకను ఉండవెల్లి వెటర్నరీ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. జింకను మహబూబ్నగర్ మయూరి పార్క్ కు తరలిస్తున్నట్లు ఎఫ్బీవో తెలిపారు.