టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌

టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌లకు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ను గురువారం ప్రకటించారు. బిగ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ను టీ20లకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. వన్డేలకు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ సారథ్యం వహించనున్నాడు. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీకి కూడా వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కింది. రెండు ఫార్మాట్లకు శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ను వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో ఏడు హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు చేసిన రియాన్‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌ హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా వన్డేల్లో కొత్త ముఖాలు. బుమ్రాకు రెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా, జడేజాకు వన్డేల్లో చోటు దక్కలేదు. 

టీ20 జట్టు : సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌, రియాన్‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ఖలీల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌. 

వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌ : రోహిత్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), కోహ్లీ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌, సుందర్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, రియాన్‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, ఖలీల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా.