IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా సూర్య

IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా సూర్య

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో లేదు చూస్తున్న ఐపీఎల్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. మే 22 నుంచి ఈ మెగా లీగ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ప్రతి సీజన్ లాగే ఈ సారి ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్ లోనే తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డ కావడంతో ఈ మ్యాచ్ లో చెన్నై ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండడం లేదు. పాండ్య నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. 

గత ఎడిషన్ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌కు గురయ్యాడు. అంటే, నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. దాంతో అతనిపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది. ఆ నిషేధం ఈ ఏడాదిలో అమలు కానుంది. రోహిత్ టీ20ల నుంచి తప్పుకున్నారు. దీనికి తోడు హిట్ మ్యాన్ కెప్టెన్సీపై ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ జట్టును నడిపించడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం సూర్య టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్. అతని కెప్టెన్సీలో భారత్ ఏడాది కాలంగా అద్భుతంగా ఆడుతుంది. 

కఠిన నిబంధనలు..

మ్యాచ్ చేజారుతుందన్నా.. లేదా కాస్త ఉత్కంఠగా సాగుతోంది అంటే ఆటగాళ్లు సమయాన్ని వృధా చేయడం కామన్. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి నలుగురైదుగురు ఒక్కచోట చేరి ప్రణాళికలు రచిస్తుంటారు. గడుస్తున్నా సమయాన్ని అసలు పట్టించుకోరు. దీన్ని కట్టడి చేయడానికే ఐపీఎల్ నిర్వాహకులు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. మొదటి సారి స్లో ఓవర్‌రేట్‌కు గురైతే కెప్టెన్‌ మ్యాచ్ ఫీజులో 12 లక్షలు కోత విధిస్తారు. అదే రెండో సారి రిపీట్ అయితే రూ. 24 లక్షలు, మూడో సారి రిపీట్ అయితే రూ. 30 లక్షల మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. ఈ రూల్సే పాండ్యాపై నిషేధానికి కారణమయ్యాయి.