
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు, మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్యపై కొంతమంది దుండగులు దాడి చేశారు. చక్రయ్య పొలం పనులు ముగించుకొని వస్తుండగా ముత్యాలమ్మ గుడి దగ్గరకు రాగానే ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చక్రయ్యను సూర్యాపేట హాస్పిటల్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చక్రయ్య మృతి చెందాడు. పాత కక్షలు కారణమై ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుంగా మిర్యాల గ్రామంలో పికెటింగ్ తో పాలు 144 సెక్షన్ విధించారు.