
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఈవో వినోద్రెడ్డి తెలిపారు. స్వామి వారికి నివేదన తయారు చేసే వ్యక్తి మద్యం తాగి వంట చేయడంతో సీరియస్గా పరిగణించిన వో ఈఅతడిని సస్పెండ్ చేశారు. ప్రతిరోజు ఉదయం 11. 30 గంటలకు జరగాల్సిన నివేదన శుక్రవారం అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన బ్రాహ్మణుడు తప్ప తాగి డ్యూటీ చేయడంతో స్వామివారి నివేదన అరగంట ఆలస్యమైనట్లు గుర్తించారు. దీంతో బ్రాహ్మణుడు సంతోష్ను సస్పెండ్ చేశారు. అలాగే ఆలయంలో వసతి గదుల కౌంటర్ వద్ద డ్యూటీ చేసే ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈవో సస్పెండ్ చేశారు.