బీజేపీ నుంచి ఆరుగురు లీడర్ల సస్పెన్షన్

బీజేపీ నుంచి ఆరుగురు లీడర్ల సస్పెన్షన్

దమ్మపేట, వెలుగు :  దమ్మపేట మండల బీజేపీలో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన ఆరుగురు లీడర్లను సస్పెండ్​ చేసినట్లు అశ్వారావుపేట అసెంబ్లీ కన్వీనర్ గుత్తిపూళ్ల దుర్గ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ALSO Read :సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్

యువ మోర్చా మండల అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వర రావు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వాసం పోలయ్య, మాజీ దళీత మోర్చా జిల్లా అధ్యక్షుడు గూడ ముత్యాల రావు, మహిళా మోర్చా నాయకురాలు రత్న కుమారి, బీజేపీ మండల అధ్యక్షుడు పూచీక ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి నాగరాజు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, పార్టీ జిల్లా అధ్యక్షుడిని అసభ్యకరంగా దూషించారని తెలిపారు. ఈ మేరకు వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు చెప్పారు.