బండ్లగూడలో స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ

బండ్లగూడలో స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ

బండ్లగూడ  జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో  స్వచ్ఛతాహి సేవ - 2024 కార్యక్రమం జరిగింది. ఇందులో  బండ్లగూడ జాగీర్ చౌరస్తా నుండి   .. హైదర్ షాకోట్ ప్రభుత్వ పాఠశాల  వద్ద ఉన్న అబ్దుల్ అబ్దుల్ కలాం విగ్రహం  వరకు వందలాది మంది విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.  అబ్దుల్ కలాం విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్  శరత్ చంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని, మా కాలనీ, బస్తీ వాసులకు  అవగాహన కల్పిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్త వేరు చేసి చెత్త ఆటోకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ సిబ్బంది,ఉపాధ్యాయులుపాల్గొన్నారు.