నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వట్లే : స్వాతి మలివాల్

నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వట్లే : స్వాతి మలివాల్
  • నాపై దాడి టైంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నరు: స్వాతి మలివాల్

న్యూఢిల్లీ:  తనపై బిభవ్ కుమార్ దాడి చేసినప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి జరుగుతుండగా ఎంత అరిచినా ఎవరూ కాపాడలేదని చెప్పారు. దాడి విషయంలో తాను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వడం లేదన్నారు. గురువారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. "మే 13న సీఎం ఇంటికి వెళ్లాను.

సిబ్బంది వచ్చి కేజ్రీవాల్ ఉన్నారు. వెయిట్ చేయాలని చెప్పారు. ఈ లోగా సీఎం పీఏ బిభవ్ వచ్చారు. ఏమైంది? అని నేను అడిగాను. దానికే  బిభవ్ నన్ను ఏడెనిమిది సార్లు కొట్టాడు. నా కాలు పట్టుకుని లాగాడు. కిందపడగానే తన్నాడు. నేను అరిచినా ఎవరూ రాలేదు" అని స్వాతి మలివాల్ వివరించారు. ఈ వివాదం వల్ల తనను అందరూ తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేయాలని కోరుతున్నారని.. కానీ తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రిజైన్ చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.