
న్యూఢిల్లీ: రైళ్ల దగ్గరకొచ్చి ఫుడ్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ, ఈ సర్వీస్లను 20 రాష్ట్రాల్లోని 100 రైల్వే స్టేషన్లకు విస్తరించింది. ఇందుకోసం ఐఆర్సీటీసీతో కలిసి పనిచేస్తోంది. రానున్న నెలల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు సర్వీస్లను విస్తరిస్తామని ప్రకటించింది. ‘ రైల్వే ప్రయాణాలు మన కల్చర్లో భాగమయ్యాయి. ఇందులో ఫుడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘ట్రైన్స్లో ఫుడ్ డెలివరీ’ సర్వీస్లను ఇండియాలోని 100 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో దేశం మొత్తం మీద ఉన్న వివిధ రకాల ఫుడ్ ఐటెమ్స్ను ప్రయాణికులకు డెలివరీ చేయడానికి వీలుంటుంది’ అని స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ పేర్కొన్నారు.