ప్రముఖ సినీ కంపెనీ అధినేత కుమార్తె..20 ఏళ్లకే క్యాన్సర్తో మృతి

ప్రముఖ సినీ కంపెనీ అధినేత కుమార్తె..20 ఏళ్లకే క్యాన్సర్తో మృతి

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ T-సిరీస్ కో ప్రొడ్యూసర్ క్రిషన్ కుమార్ కుమార్తె తీశా(20) మరణించారు. ఆమె కొంతకాలంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో గురువారం చనిపోయినట్లు సమాచారం. సెప్టెంబర్ 2003లో జన్మించిన తీశా చాలా చిన్న వయస్సులోనే చనిపోవడంతో క్రిషన్ కుమార్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

అయితే తీశా గత కొంతకాలంగా జర్మనీలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తీషా ఫ్యామిలీ ఆమెకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను అందించినప్పటికీ చనిపోవడంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. అయితే తిషా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అనేక రోపోర్ట్స్ వెల్లడించినప్పటికీ. ఈ విషయాన్ని  క్రిషన్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 

T సిరీస్ నిర్వహించే కార్యక్రమాలకు తిషా తన తండ్రి క్రిషన్‌తో పాటు వెళ్లేది. గతేడాది నవంబర్ లో రణబీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రీమియర్ తర్వాత తీశా బయట ఎక్కడ కనిపించలేదు. క్రిషన్ కుమార్ ఒకప్పటి ఫేమాస్ నటుడు, బేవఫా సనమ్ (1995) అనే మూవీతో మంచి పేరు తెచ్చుకున్నారు. అతను T-సిరీస్ యొక్క దివంగత వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ యొక్క తమ్ముడు.