జీహెచ్ఎంసీ ఆఫీసర్లు మా ఫోన్లు ఎత్తట్లే : తలసాని

జీహెచ్ఎంసీ ఆఫీసర్లు మా ఫోన్లు ఎత్తట్లే : తలసాని
  • ప్రొటోకాల్ ​పాటించకుండా అవమానిస్తున్నరు: తలసాని 

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఏడాది టైమ్​ ఇచ్చామని.. హైదరాబాద్​ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ​యాదవ్ విమర్శించారు. ఇక నుంచి ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. గురువారం గ్రేటర్ పరిధిలోని​ బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులను బల్దియా అధికారులు అవమానిస్తున్నారని, ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పాటించడం లేదన్నారు.

 ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఫోన్​ చేస్తే అధికారులు ఎత్తడం లేదని, నంబర్లు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టులో పెడుతున్నారన్నారు. ఈ విషయాన్ని కమిషనర్​కు చెప్పామన్నారు. కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ ​పార్టీదే మెజార్టీ అయినప్పటికీ పట్టించుకోవడం లేదని, వారు తలచుకుంటే సభను నడపగలుగుతారా? అని తలసాని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్​లోకి వెళ్లిన మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గద్వాల్ ​విజయలక్ష్మి సిటీని దోచుకుంటున్నారని జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, హోటళ్ల యాజమాన్యాలను బెదిరించి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.