
కడెం, వెలుగు: జిల్లా కరాటే ఛాంపియన్షిప్–2024 పోటీల్లో లింగాపూర్ ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్లు సత్తా చాటారు. నిర్మల్ జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కడెం మండలం లింగాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాహితి బంగారు పతకం, ఝాన్సీ, అక్షయ మేఘన, కాంస్య పతకాలు సాధించారు. ఈ పథకాలు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని అభినందించారు.