ఎట్టెట్టా​: భగవద్గీత పుస్తకం మాట్లాడుతుంది.. శ్లోకాలను చదువుతుంది...

ఎట్టెట్టా​:  భగవద్గీత పుస్తకం మాట్లాడుతుంది.. శ్లోకాలను చదువుతుంది...

ఇప్పటి వరకు మాట్లాడే బొమ్మలనే చూశాం.. కాని తాజాగా  ఇప్పుడు మాట్లాడే పుస్తకాలు కూడా వచ్చాయి.ప్రపంచంలో ఎన్నో వింతలు.. విశేషాలు ఉన్నాయి.  అవి మనకు తెలిసినవి కొన్నయితే.. చాలావరకు తెలియనవే ఉన్నాయి.  సోషల్​ మీడియాలో రోజుకొక కొత్త  వింత వార్తలు చూస్తున్నాం.. ఇప్పుడు తాజాగా భగవద్గీత పుస్తకం మాట్లాడుతుందట.. అంటే బుక్​ తెరిస్తే చాలు ఆ పేజీలోని శ్లోకాలను  బ్యాక్​ గ్రౌండ్​ మ్యాజిక్​ తో  చదువుతుందట.. ఇప్పడు మాట్లాడే భగవద్గీత గురించి తెలుసుకుందాం. . . .

మనం ఇప్పటి వరకు భగవద్గీత చదివాం. ఎవరైనా చెప్తే విన్నాం. కానీ.. ఇప్పుడు మాట్లాడే స్మార్ట్ భగవద్గీత పుస్తకం వచ్చేసింది. 
ఈ పుస్తకం కొంటే దాంతోపాటు ఒక డివైజ్ కూడా ఇస్తారు. దానికి పుస్తకంలోని ఏ పేజీ చూపిస్తే ఆ పేజీలోని శ్లోకాలను చదువుతుంది. 
 
స్మార్ట్ భగవద్గీతను ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ రూపొందించింది. ఈ పుస్తకం సెన్సర్లతో పని చేస్తుంది. పుస్తకంతోపాటు ఒక విజ్ డమ్ ఫ్రూట్ ఇస్తారు. అది ఏ పేజీలో ఉంచితే ఆ పేజిలోని శ్లోకాలను చదువుతుంది. అంతేకాదు శ్లోకానికి అనుగుణంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. 

ALSO READ | Vastu Tips:.. పూజగది వాస్తు: డూప్లెక్స్​ హౌస్​ లో పూజ గది ఏ అంతస్థులో ఉండాలి..

ఇప్పటితరం వాళ్లలో చాలామందికి భగవద్గీత చదవాలనే ఓపిక ఉండదు. కానీ.. చదవాలనే ఇష్టం మాత్రం ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకానికి మార్కెట్లో చాలా డిమాండ్ 
ఉంది. 

ప్రస్తుతం ఇది తెలుగు, హిందీ, సంస్కృతం భాషల్లో అందుబాటులో ఉంది. కమలాపూర్​ కు  చెందిన యువకులు తుమ్మ శరత్, బోది కిషోర్.. టాకింగ్ భగవద్గీతను పదివేల రూపాయలకు కొన్నారు. అయితే.. ఈ పుస్తకాన్ని చూడ్డానికి చాలామంది వాళ్ల ఇంటికి వస్తున్నారు. పుస్తకంతో వచ్చే విజ్ డమ్ ఫ్లూట్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు గంటలపాటు మాట్లాడుతుంది. దీనికి స్పీకర్ ఉంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూడా వినొచ్చు. ఈ కంపెనీ త్వరలోనే టాకింగ్ ఖురాన్, బైబిల్​ ను కూడా తయారు చేసే ఆలోచనలో ఉంది ఢిల్లీ కంపెనీ . . .

–వెలుగు, లైఫ్​–