ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు.. క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ ఆరోపణలు ఖండించిన మిల్కీ బ్యూటీ

ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు.. క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ ఆరోపణలు ఖండించిన మిల్కీ బ్యూటీ

క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ లో టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్ కు పుదుచ్చేరి పోలీసులు సమన్లు జారీ చేశారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ ఖండించారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారిపై చర్యలు తీసుకుంటానని తెలిపింది తమన్నా.క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్ లో తన ప్రమేయం ఉందని వస్తున్న రూమర్స్ తన దృష్టికి వచ్చాయని.. ఇలాంటి ఫేక్ న్యూస్ ని రూమర్స్ ని స్ప్రెడ్ చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నానని అన్నారు తమన్నా. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారిపై చర్యలు తీసుకునే దిశగా తన టీం వర్క్ చేస్తోందని అన్నారు తమన్నా.

కోయంబత్తూరుకు చెందిన ఒక కంపెనీ క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో తనను మోసం చేసిందని.. పుదుచ్చేరికి చెందిన మాజీ సైనికుడు అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తన ఫిర్యాదులో, క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో సదరు కంపెనీ తనను మోసం చేసిందని ఆరోపించారు అశోకన్.రూ.1 కోటి పెట్టుబడి పెట్టానని, అంతే కాకుండా 10 మంది స్నేహితులతో మొత్తం రూ.2.4 కోట్లు పెట్టుబడి పెట్టించానని పేర్కొన్నారు అశోకన్.

Also Read:-ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో కియారా పోస్ట్..

సదరు కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమన్నా హాజరైనట్లు తెలుస్తోంది. మహాబలిపురంలో జరిగిన మరో కార్యక్రమానికి కాజల్ హాజరైనట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో రూ. 10లక్షల నుంచి కోటి రూపాయల విలువచేసే లగ్జరీ కార్లను 100మందికి పైగా గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది.