ఐఏఎఫ్ కోరిన దానికంటే ఎక్కువ సౌకర్యాలిచ్చాం: తమిళనాడు సీఎం

ఐఏఎఫ్ కోరిన దానికంటే ఎక్కువ సౌకర్యాలిచ్చాం: తమిళనాడు సీఎం
  • ఎయిర్ షో ఘటనపై తమిళనాడు సీఎం

చెన్నై: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం స్పందించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కోరిన దానికంటే ఎక్కువ సౌకర్యాల ను కల్పించామని తెలిపారు. ఎయిర్ షోకు జనం అంచనాలను మించి వచ్చారని వెల్లడించారు. 

తిరిగి వెళ్లేటప్పుడు తమ వెహికల్స్​ను, ప్రజా రవాణాను చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఎయిర్ షో కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.