నీతీ ఆయోగ్ బహిష్కరిస్తాం: తమిళనాడు సీఎం స్టాలిన్

నీతీ ఆయోగ్ బహిష్కరిస్తాం: తమిళనాడు సీఎం స్టాలిన్


చెన్నై: కేంద్ర బడ్జెట్ లో తమిళనాడు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం ఎంకే స్టాలిన్.. కేంద్రంలో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా బీజేపీ ప్రజలను చేసిందేమీ లేదని అన్నారు. తమిళనాడు చారిత్రక విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ నిధులు కేటాయించలేదని అన్నారు. తమిళనాడుకు ఎలాంటి పథకాలు  ప్రకటించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని తమిళనాడు సీఎం ఎంకేస్టాలిన్ అన్నారు. 

మంగళవారం (జూలై 23, 2024) పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డారు. ఈ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని అన్నారు. విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్ నిధులు కేటాయించిన వారికి.. తెలంగాణ గుర్తు కు రాలేదా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అనేకసార్లు తెలంగాణ పరిస్థితిపై వివరించిన నిధులు కేటాయించలేదని అన్నారు.