సనాతన ధర్మంపై కామెంట్ చేసిన ప్రకాష్ రాజ్.. కోటి నష్టం అంటూ నిర్మాత ఫైర్..

సనాతన ధర్మంపై కామెంట్ చేసిన ప్రకాష్ రాజ్.. కోటి నష్టం అంటూ  నిర్మాత ఫైర్..

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో తిరుపతి లడ్డు వివాదం మరియు సనాతన ధర్మం వంటి అంశాలపై ట్వీట్లు చేస్తూ వివాదాల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ  పరోక్షంగా విమర్శలు చేస్తున్నాడు. 

అయితే ఇటీవలే నటుడు ప్రకాష్ రాజ్ తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి తమిళ ప్రముఖ హీరో మరియు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా వచ్చాడు. ఈ క్రమంలో సమానత్వం గురించి మాట్లాడారు. 

దీంతో ప్రకాష్ రాజ్ ఈ విషయం గురించి స్పందిస్తూ  "తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్   సమానత్వం గురించి మాట్లాడుతున్నారని,  మరొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ ఏదేదో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై  సెటైర్లు వేశారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ పనికి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో తమిళ ప్రముఖ సినీ నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులో భాగంగా "మీతో పాటు కూర్చున్న ఇతర ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో గెలిచారు. కానీ మీరు మాత్రం గెలవడం అటుంచితే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారని ఘాటుగా విమర్శించారు.

ఇక గతంలో తాను నిర్మించిన  సినిమాలో నటించేటప్పుడు చెప్పకుండా షూటింగ్ సెట్‌ నుంచి వెళ్లిపోవడంతో దాదాపుగా రూ. కోటి నష్టం పోయానని దీనిపై ఇప్పటివరకూ మీరు నాతో మాట్లాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే #జస్ట్యాస్కింగ్ అని ట్యాగ్ చేశారు. మరి ప్రకాష్ రాజ్ ఈ విషయంపై ఈ విధంగా స్పందిస్తాడో చూడాలి.