
- 4 వెహికల్స్ సీజ్, నలుగురి అరెస్ట్
మెదక్, అల్లాదుర్గం, వెలుగు: జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందా గుట్టురట్టయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ బాలస్వామి మంగళవారం మీడియాకు వెల్లడించారు. అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్ లోని శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని రమేశ్ రేషన్బియ్యాన్నికొనుగోలు చేసి అమ్ముతున్నట్టు సమాచారం అందిందన్నారు.
ఈ మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి రైస్ మిల్ దగ్గర వాహనాల్లో తరలిస్తన్న 540 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన పీడీఎస్రైస్ విలువ రూ.10.80 లక్షలు ఉంటుందని వివరించారు. బియ్యాన్ని రవాణా చేస్తు పట్టుడిన వాహనాల విలువ రూ. 23 లక్షలు ఉంటుందన్నారు. రైస్మిల్యజమాని రమేశ్పై కేసు నమోదు చేయడంతో పాటు, రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న వెలికి చర్లకు చెందిన చకాని సాయి విక్రమ్, ప్రేమ్కుమార్గౌడ్, కర్నాటక రాష్ట్రం బీదర్జిల్లా సిర్సి జీపీ పరిధి హసిన్పూర్కు చెందిన గుంబర్ బస్వరాజ్
నల్గొండ జిల్లా చినతపల్లి మండలం ఉమ్మంతలపల్లికి చెందిన బాలయ్య, సంగారెడ్డి జిల్లా కల్హేర్మండలం మాణిక్ నాయక్ తండాకు చెందిన సబావత్ జైరామ్ ను అరెస్ట్ చేసినట్టు వివరించారు. సమావేశంలో డీఎస్పీ రాజేశ్, సీఐ రేణుక, డీటీ ప్రణీత రెడ్డి, సీఐ తిరుమలేశ్, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.