చంద్రుగొండలో రేషన్​బియ్యం పట్టివేత : ఎస్సై మహేందర్

చంద్రుగొండలో రేషన్​బియ్యం పట్టివేత : ఎస్సై మహేందర్

నెక్కొండ/ కొత్తగూడ, వెలుగు: రైస్​మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రేషన్​బియ్యాన్ని పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఎస్సై మహేందర్ వివరాల ప్రకారం.. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ మల్లికార్జున రైస్​మిల్లులో 62 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం నిల్వచేశారనే సమాచారంతో టాస్క్​ఫోర్స్, సివిల్​పోలీసులు రైడింగ్ చేసి, స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.

మిల్లు ఓనర్ సంగని సూరయ్య, బియ్యం సరఫరా చేస్తున్న రేకులకుంట తండాకు చెండాకు చెందిన జాటోతు యాకుబ్​పై కేసునమోదు చేసుకుని, బైక్​ను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహబూబాబాద్​జిల్లా గంగారం మండలం మడగూడలో కొందరు భద్రాద్రి కొత్తగూడం జిల్లా మాణిక్యారం, మిర్యాలపెంట గ్రామాలకు చెందిన వారు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి తరలిస్తుండగా, గ్రామస్తులు అడ్డగించారు. దీంతో బయ్యాన్ని అక్కడే వదిలేసి ఆటోతో పరారయ్యారు. ఎస్సై రవిని వివరణ కోరగా విషయం తెలిసిందని ఆటోను, కొనుగోలుదారులను గుర్తించి కేసు నమోదు  చేస్తామన్నారు.