
- కొండాపూర్లో డీజే ప్లేయర్ అరెస్ట్
- 6.7 గ్రాముల ఎండీఎంఏ సీజ్
హైదరాబాద్సిటీ, వెలుగు: కొండాపూర్ ఆర్టీఓ ఆఫీసు ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్న డీజే ప్లేయర్ ను టాస్క్ఫోర్స్టీమ్పట్టుకుని 6.7 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేసింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన సుజిత్బెంగళూరులో చదువుకునే టైంలో డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. హైదరాబాద్కు వచ్చి పబ్బుల్లో డీజే ప్లేయర్గా పని చేస్తున్నాడు. సంపాదన సరిపోక బెంగళూరులో గ్రాము ఎండీఎంఏను రూ.2 వేలకు కొని, సిటీలో అమ్ముతున్నాడు. ఇక్కడ ఒక్కో గ్రామును రూ.5 వేలకు విక్రయిస్తున్నాడు.
సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్- డీ టీమ్ సుజిత్ను అదుపులోకి తీసుకుంది. అతని నుంచి 6.7 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్సీఐ నాగరాజు తెలిపారు. హోలీ వస్తుండడంతో నాలుగు రోజుల కింద బెంగళూరు నుంచి10 గ్రాములు తీసుకువచ్చాడని, కొద్దిగా అమ్మి మిగిలిన ఎండీఎంఏను ఇంట్లో పెట్టుకున్నాడన్నారు. సుజిత్ను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.