
న్యూఢిల్లీ: ముడి సరుకుల ఖర్చుల భారాన్ని తట్టుకోవడానికి వచ్చే నెల నుంచి కమర్షియల్వెహికల్స్ ధరలను రెండు శాతం వరకు పెంచుతామని టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి ధరలు మారుతాయి.
టాటా గ్రూపులో భాగమైన టాటా మోటార్స్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, ట్రక్కులు, బస్సులు తయారు చేస్తోంది. మారుతి సుజుకీ కూడా నాలుగు శాతం వరకు ధరలను పెంచుతామని తెలిపింది.