వైజాగ్​లో టీసీఎస్​ కంపెనీ : నారా లోకేశ్​

వైజాగ్​లో టీసీఎస్​ కంపెనీ : నారా లోకేశ్​

న్యూఢిల్లీ : ఐటీ సేవల కంపెనీ టీసీఎస్​ వైజాగ్​లో కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్​ మంత్రి నారా లోకేశ్​ వెల్లడించారు. దీనివల్ల 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ విషయమై టాటా గ్రూపు చైర్మన్​ చంద్రశేఖరన్​తో ముంబైలో చర్చించానని అన్నారు.

తమ రాష్ట్రంలో ఐటీ, ఇతర రంగాల్లోని అవకాశాలు, అభివృద్ధి గురించి వివరించానన్నారు.