
టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) 2024 నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఆ ప్రకారం మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ 20 నుంచి జూన్ 3 వరకు ఆన్లైన్లో టెట్ ఎగ్జామ్ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావొచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్: టెట్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.400 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. పూర్తి వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.